ఉప్పెన సినిమాతో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా మంచి హిట్ ను సాధించాక.
బుచ్చిబాబు రేంజ్ మరింత పెరిగిపోయింది.అంతేకాకుండా పలువురు స్టార్ హీరోలతో కూడా సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా ఈయన చెప్పిన ఓ డైలాగు కి భారీగా ట్రోలింగ్స్ ఎదురవుతున్నాయి.ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే.
ఈ మధ్యకాలంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కే జి ఎఫ్.ఈ సినిమాకు కన్నడ స్టార్ హీరో యష్ నటించిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిందో చూశాము.అంతేకాకుండా ఈ సినిమాకి విపరీతమైన ఫాలోయింగ్ కూడా పెరిగింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం బుచ్చిబాబు గురువు సుకుమార్ పుష్ప సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుంది.
ఈ నేపథ్యంలో ఇటీవలే బుచ్చిబాబు ఓ క్లబ్ హౌస్ ఇంటరాక్షన్ లో పాల్గొన్నాడు.
ఎంతైనా గురువు కదా ఇక ఆయన సినిమాని పొగడకుండా ఉంటాడా.ఇక సుకుమార్ తీస్తున్న పుష్ప సినిమా గురించి ఓ రేంజ్ లో వ్యాఖ్యానించాడు.పైగా కే జి ఎఫ్ సినిమా తో పోల్చాడు.
పుష్ప ఫస్ట్ పార్ట్ చూశాను అంటూ.అందుకే చెబుతున్నానని.
ఓ 10 కే జి ఎఫ్ లు కలిపితే పుష్ప ఫస్ట్ పార్ట్ అవుతుందని, హీరో క్యారెక్టరైజేషన్, ఎలివేషన్ ఓ రేంజ్ లో ఉందని తెలిపాడు.
ఇక బుచ్చిబాబు మాటలు విన్న నెటిజనులు ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు.ఆపవయ్యా నీ భజన అంటూ.సినిమా కోసం అల్లు అర్జున్ ని అడుక్కోవాలి కానీ ఇలాంటి భజనలు చెయ్యొద్దు అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఏ సినిమా రేంజ్ కి ఆ సినిమా గురించి తెలపాలని.అంతే కానీ వేరే సినిమాలతో పోల్చవద్దని బాగా మండిపడుతున్నారు.మరికొందరు ఈయన తీసిన ఒక్క సినిమానే కానీ ఇంతలా ఫీల్ అవుతున్నాడని బాగా ట్రోల్స్ చేస్తున్నారు.