ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సాహో’ చిత్రం విడుదలకు సిద్దం అవుతోంది.ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సాహో చిత్రం టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సాహో టీజర్కు ఫ్యాన్స్ నుండి మంచి టాక్ వచ్చింది.అయితే కొందరు మాత్రం టీజర్ను ట్రోల్స్ చేస్తున్నారు.
టీజర్లోని యాక్షన్ సీన్స్ను కొందరు తప్పుబడుతున్నారు.పూర్తిగా యాక్షన్ ఏంటీ అంటూ ఎద్దేవ చేస్తూ చిత్ర విచిత్రమైన కామెంట్స్ చేస్తున్నారు.
‘సాహో’ టీజర్ను చూస్తుంటో ఇదేదో పబ్ జీ గేమ్ వీడియోను చూస్తున్నట్లుగా అనిపించిందని, హాలీవుడ్ మూవీ యాక్షన్ సీన్స్ను టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే ఎవరు మాత్రం ఆసక్తిని కనబర్చుతారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.పబ్ జీ గేమ్ తరహాలో ఉన్న టీజర్ను చూస్తుంటేనే సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అంటూ మరి కొందరు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.
మొత్తానికి సోషల్ మీడియా పోస్ట్లు చూస్తున్న కొందరు ఔను నిజమే కదా అనుకుంటున్నారు.
సాహో చిత్రం యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రం అంటూ ముందు నుండే ప్రచారం జరుగుతుంది.అయితే సినిమాలో మొత్తం యాక్షన్ ఉంటే మాత్రం సినిమా ఆడటం కష్టమే అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది.ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా సినిమా ఉంటేనే కోట్ల వసూళ్లు నమోదు అవుతాయి.
ఈ విషయంను సుజీత్ గుర్తించాడో లేదో చూడాలి.ఒక వేళ ఫ్యామిలీ ఆడియన్స్కు ఈ చిత్రం దూరంగా నిలిస్తే మాత్రం కష్టమే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.