సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య వివాహం వారం రోజుల క్రితం వైభవంగా జరిగిన విషయం తెల్సిందే.వ్యాపారవేత్త విషాగన్ను సౌందర్య రెండవ వివాహం చేసుకుంది.2016లో మొదటి భర్త అశ్విన్ నుండి విడాకులు తీసుకున్న ఈమె ఆ తర్వాత పరిచయమైన విషాగన్తో ప్రేమలో పడింది.ఇరు కుటుంబాల ఒప్పందంతో పెళ్లి కూడా చేసుకుంది.
పెళ్లికి తమిళ సినీ ప్రముఖులు, బాలీవుడ్ ప్రముఖులు హాజరు అయ్యారు.పెళ్లి తంతు ముగించుకుని సౌందర్య మరియు విషాగన్లు హనీమూన్కు వెళ్లారు.
హనీమూన్లో తాము ఎంజాయ్ చేస్తున్నట్లుగా సౌందర్య ట్విట్టర్లో పోస్ట్లు పెట్టింది.
సౌందర్య పోస్ట్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.ప్రస్తుతం దేశంలో అత్యంత విషాదకర పరిస్థితి నెలకొంది.40 మంది ఇండియన్ జవాన్లను ఉగ్రవాదులు మానవబాంబుతో పేల్చి వేయడం జరిగింది.20 ఏళ్ల తర్వాత అత్యంత పెద్ద ఉగ్రదాడిగా చెప్పుకుంటున్నారు.దేశ వ్యాప్తంగా తీవ్ర దిగ్బ్రాంతిలో ఉంది.
జవాన్ల కుటుంబాలకు అండగా నిలిచేందుకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.సోషల్ మీడియాలో అంతా కూడా వీర జవాన్లకు శ్రద్దాంజలి ఘటిస్తూ పోస్ట్లు పెడుతున్నారు.
ఇలాంటి సమయంలో సౌందర్య మాత్రం హనీమూన్ పిక్స్ పెట్టింది.
సౌందర్య తీరుతో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు, మీకు బుద్ది ఉందా మేడం అంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇంతటి విషాదకర పరిస్థితుల్లో ఇలాంటి సిల్లీ పోస్ట్లు ఏంటీ, మీకు సమాజం పట్ల, దేశం పట్ల కనీసం బాధ్యత ఉందా అంటూ ప్రశ్నించారు.హనీమూన్ అనేది ఆమె వ్యక్తిగత విషయం కావచ్చు అయితే సోషల్ మీడియాలో ఈ టైంలో ఫొటోలు పెట్టడం అనేది చాలా పెద్ద తప్పుగా నెటిజన్స్ పరిగణిస్తున్నారు.
మరి సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్న విమర్శలపై సౌందర్య ఇప్పటి వరకు అయితే ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు.విమర్శించే వారితో పాటు ఆమెకు మద్దతుగా నిలిచే వారు కూడా ఉన్నారు.