తెలుగులో తక్కువ సినిమాలే చేసినా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో అమీషా పటేల్( Ameesha Patel ) ఒకరు.పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్ లతో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేకపోయారు.
బాలీవుడ్ లో మాత్రం ఈ బ్యూటీకి చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాలు దక్కాయి.అయితే తాజాగా అమీషా పటేల్ చేసిన ఒక పని వివాదాస్పదం అవుతోంది.
కొన్నిరోజుల క్రితం కృతిసనన్( Kritisanan ) చెంపపై ఓం రౌత్( Om Rauth ) ముద్దు పెట్టడం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.ఈ ఘటన మరిచిపోక ముందే ఇదే తరహాలో మరో ఘటన జరగడం గమనార్హం.
ప్రస్తుతం గదర్2 ( Gadar 2 )అనే సినిమాలో అమీషా పటేల్ నటిస్తున్నారు.ఈ సినిమాలో సిక్కుల పవిత్ర స్థలం అయిన గురుద్వారాలో కొన్ని సన్నివేశాల షూటింగ్ జరిగినట్టు సమాచారం.
ఆ సీన్లలో ముద్దు సన్నివేశాలతో పాటు కౌగిలింతలకు సంబంధించిన సన్నివేశాలు సైతం ఉన్నాయి.
అయితే ఈ సన్నివేశాల విషయంలో సిక్కు మతస్థులు సీరియస్ అవుతున్నారు.ఈ నటీనటులకు కొంచెమైనా బుద్ధి, జ్ఞానం లేదా అని కామెంట్లు వ్యక్తపరుస్తున్నారు.గురుద్వారా నిర్వాహకులు ఈ ఘటన విషయంలో సీరియస్ అవుతుండగా చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
దేవుడిని నమస్కరించే సీన్ షూట్ చేస్తామని చెప్పి చిత్రయూనిట్ అనుమతులు తీసుకుందని గురుద్వారా మేనేజర్ సత్బీర్ సింగ్, సెక్రటరీ శివ కన్వర్ సింగ్( Satbir Singh, Secretary Shiv Kanwar Singh ) వెల్లడించారు.
నెగిటివ్ కామెంట్ల విషయంలో చిత్రయూనిట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.అమీషా పటేల్ వివరణ ఇవ్వడం లేదా క్షమాపణలు చెబితే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఈ మధ్య కాలంలో వరుసగా వివాదాల్లో చిక్కుకుంటూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.