మలయాళంలో సూపర్ సక్సెస్గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ చిత్రం అక్కడ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.
అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.ఇప్పటికే రీమేక్ రైట్స్ను సొంతం చేసుకున్న ఈ బ్యానర్, త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతోంది.
కాగా ఈ సినిమాలో తొలుత నందమూరి బాలకృష్ణ, రానా దగ్గుబాటిలను తీసుకోవాలని చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రయత్నించాడు.కానీ బాలయ్య ఈ సినిమాలో నటించేందుకు పెద్దగా ఆసక్తిగా లేడని తెలుస్తోంది.
దీంతో మాస్ రాజా రవితేజ ఈ సినిమాలో నటిస్తున్నాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇంకా ఈ సినిమాలో ఎవరు నటిస్తారనే విషయంపై క్లారిటీ రాలేదు.
కాగా ఈ సినిమాకు మాటలను అందించాల్సిందిగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ను కోరాడట నాగవంశీ.దీంతో త్రివిక్రమ్ ఈ రీమేక్ చిత్రానికి మాటలు అందించేందుకు ఒప్పుకున్నాడట.
అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే దర్శకుడు ఎవరు అనే అంశంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.ఇక తాజాగా ఈ సినిమాను మలయాళంలో చూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఈ సినిమా బాగా నచ్చిందని, ఆయన ఈ సినిమా రీమేక్పై ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది.
ఇక ఈ వార్తతో ఒక్కసారిగా ఈ రీమేక్ చిత్రంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.మరి త్రివిక్రమ్ ఈ సినిమాకు మాటలను అందించేందుకు ఒప్పుకున్నది ఎందుకో? అనే అసలు విషయం తెలియాలంటే ఈ సినిమా పట్టాలెక్కే వరకు ఆగాల్సిందే.