మలయాళ రీమేక్‌కు మాంత్రికుడి మాటలు?

మలయాళంలో సూపర్ సక్సెస్‌గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ చిత్రం అక్కడ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.

 Trivikram To Pen Dialogues For Ayyappanum Remake, Trivikram, Ayyappanum Koshiyum-TeluguStop.com

అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.ఇప్పటికే రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ఈ బ్యానర్, త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతోంది.

కాగా ఈ సినిమాలో తొలుత నందమూరి బాలకృష్ణ, రానా దగ్గుబాటిలను తీసుకోవాలని చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రయత్నించాడు.కానీ బాలయ్య ఈ సినిమాలో నటించేందుకు పెద్దగా ఆసక్తిగా లేడని తెలుస్తోంది.

దీంతో మాస్ రాజా రవితేజ ఈ సినిమాలో నటిస్తున్నాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇంకా ఈ సినిమాలో ఎవరు నటిస్తారనే విషయంపై క్లారిటీ రాలేదు.

కాగా ఈ సినిమాకు మాటలను అందించాల్సిందిగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ను కోరాడట నాగవంశీ.దీంతో త్రివిక్రమ్ ఈ రీమేక్ చిత్రానికి మాటలు అందించేందుకు ఒప్పుకున్నాడట.

అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే దర్శకుడు ఎవరు అనే అంశంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.ఇక తాజాగా ఈ సినిమాను మలయాళంలో చూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఈ సినిమా బాగా నచ్చిందని, ఆయన ఈ సినిమా రీమేక్‌పై ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది.

ఇక ఈ వార్తతో ఒక్కసారిగా ఈ రీమేక్ చిత్రంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.మరి త్రివిక్రమ్ ఈ సినిమాకు మాటలను అందించేందుకు ఒప్పుకున్నది ఎందుకో? అనే అసలు విషయం తెలియాలంటే ఈ సినిమా పట్టాలెక్కే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube