డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘రంగ్ దే‘.ఈ సినిమాలో యంగ్ హీరో నితిన్, మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాణంలో పి వి డి ప్రసాద్ సమర్పణలో నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ప్రేక్షకులనుండి మంచి ప్రశంసలు అందుకున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మార్చి 26న విడుదల కానుంది.ఈ సినిమా లవ్, ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ గా తెరకెక్కనుంది.ఇదిలా ఉంటే ఈ సినీ బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వెంటనే చేస్తున్నారు.ఈరోజు ఈ సినీ ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా జరగనుంది.
ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రాబోతున్నట్లు సినీ బృందం ప్రకటన చేశారు.
హైదరాబాద్ లోని శిల్పకళావేదికపై ఈ వేడుక జరగనుండగా.
త్రివిక్రమ్ హాజరుకానున్నారు.ఇంతకుముందు నితిన్ నటించిన భీష్మ సినిమా వేడుకకు కూడా త్రివిక్రమ్ ముఖ్యఅతిథిగా హాజరవ్వగా.
దీనికి ఓ కారణం ఉంది.సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంత బ్యానర్ కంటే ఎక్కువే.
ఈ బ్యానర్ లో తెరకెక్కే ప్రతి ఒక్క సినిమాకు త్రివిక్రమ్ సపోర్టుగా నిలుస్తాడట.అందుకే నితిన్ నటించిన ఈ సినిమా కూడా తానే బాధ్యతలు తీసుకున్నాడట.
ఇక ఈ సినిమా ట్రైలర్ బాగా ఆకట్టుకోగా.ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఈ సినిమా గురించి త్రివిక్రమ్ ఈ వేడుకలో ఏం చెబుతాడో చూడాల్సిందే.