మాటల మాత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ తన నెక్స్ట్ సినిమా సూపర్ స్టార్ మహేష్ తో చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాగా తర్వాత షెడ్యూల్ కి కొద్దిగా టైం తీసుకున్నారు.
ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్న త్రివిక్రం సినిమా కోసం తన సెంటిమెంట్ ఒకటి బ్రేక్ చేస్తునాడని తెలుస్తుంది.త్రివిక్రం సినిమాల్లో ఇప్పటి వరకు ఐటం సాంగ్ అన్నది లేదు.
ఆ సాంగ్స్ అనవసరం అనుకుంటాడు త్రివిక్రం.అయితే సినిమాకు వచ్చే విభిన్న రకాల ఆడియన్స్ లో ఆ స్పెషల్ సాంగ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు.
సుకుమార్ మాత్రం ఈ విషయంలో ఎక్కడ తగ్గడు.తన సినిమాలో కచ్చితంగా ఒక స్పెషల్ సాంగ్ పెట్టేస్తాడు.అయితే త్రివిక్రం కూడా ఇప్పుడు తన సెంటిమెంట్ బ్రేక్ చేసి ఎస్.ఎస్.ఎం.బి 28 సినిమాలో స్పెషల్ ఐటం సాంగ్ పెడుతున్నాడట ఈ సాంగ్ లో ప్రముఖ స్టార్ హీరోయిన్ నటిస్తుందని టాక్.అదే జరిగితే త్రివిక్రం కూడా పూర్తిగా కమర్షియల్ ఫార్మెట్ లోకి వచ్చేసినట్టే అని చెప్పొచ్చు. సూపర్ స్టార్ మహేష్ తో అతడు, ఖలేజా సినిమాలు చేసిన త్రివిక్రం 11 ఏళ్ల తర్వాత ఈ హ్యాట్రిక్ మూవీ చేస్తున్నారు.