మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల్లోనే కాకుండా ఏదైనా కార్యక్రమంలో మాట్లాడినా కూడా ఆలోచింపజేసే విధంగా ఉంటాయి.తాజాగా కూడా ఈయన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఆడియో సక్సెస్ మీట్లో తనేంటో మరోసారి నిరూపించుకున్నాడు.
విజయవాడలో జరిగిన ఈ ఆడియో సక్సెస్ మీట్లో త్రివిక్రమ్ తనకు మాట్లాడటం రాదు అంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టాడు.ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియదంటూ ఆందరిని ఆకట్టుకునేలా తన ప్రసంగాన్ని కొనసాగించాడు.
త్రివిక్రమ్ మాట్లాడుతూ… తాను పవన్ కళ్యాణ్కు మిత్రుడిని అయినందుకు ఇబ్బంది పడుతున్నా.తాను వెళ్లిన ప్రతి ఫంక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిందిగా అభిమానులు కోరుతున్నారు.
పవన్ కళ్యాణ్ తనను ఇబ్బంది పెట్టే స్నేహితుడిగా మారాడని చెప్పుకొచ్చాడు.పవన్ కళ్యాణ్ను చూస్తుంటే దేవుల పల్లి కృష్ణ శాస్త్రి చెప్పిన మాట.‘నాయకుడనేవాడు జనంతో పాటు నడవకూడదు, జనం కంటే నాలుగు అడుగులు ముందు నడవాలి’ గుర్తుకు వస్తుంది.ప్రతి క్షణం కూడా జనం హితంను పవన్ కోరుకుంటాడని పేర్కొన్నాడు.
ప్రతి ఫంక్షన్లో ఆయన అభిమానుల సందడిని తాను పవన్కు వెళ్లడిస్తానని చెప్పుకొచ్చాడు.