ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీని విలన్ల, కొరత వేధిస్తోంది.కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తున్న విలన్లు, ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోవడంతో చాలామంది స్టార్ డైరెక్టర్లు ఇతర భాషల హీరోలను, దర్శకులను తమ సినిమాల్లో విలన్లుగా చూపిస్తున్నారు.
అలా ఈ మధ్య కాలంలో విలన్లుగా సముద్రఖని, విజయ్ సేతుపతి, ఆర్యల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా రీమేక్ తెలుగులో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కథనం, మాటలు అందిస్తున్నారని నిన్న సాయంత్రం చిత్రయూనిట్ నుంచి కీలక ప్రకటన వెలువడింది.ఇకపోతే ఈ సినిమాలో కీలక పాత్రలో తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని నటిస్తున్నారని సమాచారం.
క్రాక్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో సముద్రఖని మాట్లాడుతూ తను అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాలో నటిస్తున్నట్టు తెలిపారు.
గతంలోనే సముద్రఖని అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు రాగా సముద్రఖని అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
త్రివిక్రమ్ ఫోన్ చేసి ఒక ముఖ్యపాత్రలో నటించాలని చెప్పారని తాను వెంటనే అంగీకరించానని చెప్పారు.సాధారణంగా త్రివిక్రమ్ తన సినిమాల్లో హీరోయిన్లను, కొంతమంది ఆర్టిస్ట్ లను రిపీట్ చేస్తుంటారని ఆయన సినిమాలు చూసేవాళ్లకు తెలిసిన విషయమే.
అదే విధంగా త్రివిక్రమ్ కథనం, మాటలు అందిస్తున్న అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు కూడా అల వైకుంఠపురములో విలన్ ను తీసుకుని త్రివిక్రమ్ సెంటిమెంట్ ను రిపీట్ చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సినిమాలో సముద్రఖని పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారని నెగిటివ్ షేడ్స్ తో ఆయన పాత్ర ఉంటుందని తెలుస్తోంది.సముద్రఖని ఈ సినిమాలో రానా తండ్రి పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.