దిగ్గజ దర్శకుడు రాజమౌళి “బాహుబలి” సినిమా తో దేశవ్యాప్తంగా మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించిన సంగతి తెలిసిందే.బాహుబలి తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేక రికార్డులు సృష్టించిన రాజమౌళి.
అప్పట్లో పలు ఇండస్ట్రీలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో తన కెరియర్ విషయాల గురించి అదేవిధంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పకు రావడం జరిగింది.
ఆ సమయంలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అంటూ చెప్పుకొచ్చాడు.
కచ్చితంగా సినిమా తీస్తానని రాజమౌళి చాలా ఇంటర్వ్యూలలో తెలిపారు.ఇదే క్రమంలో అప్పట్లో అమీర్ ఖాన్ తో రాజమౌళి ఒకసారి స్టొరీ డిస్కషన్ అనేసరికి అందరూ మహాభారతం ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది అని భావించారు.
కానీ రాజమౌళి “RRR” ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది.ఇదిలా ఉంటే రాజమౌళి కంటే ముందే మహాభారతం సినిమా చేయడానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రెడీ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.
లాక్ డౌన్ సమయం లో చాలా టైం దొరకటంతో “మహాభారతం” అదేవిధంగా “రామాయణం” కథలకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ త్రివిక్రమ్ రెడీ చేసుకున్నట్లు ఫిలింనగర్ లో తాజాగా వార్తలు వినబడుతున్నాయి.ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ హీరోగా సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.ఈ ప్రాజెక్ట్ అయిన వెంటనే త్రివిక్రం “మహాభారతం” ప్రాజెక్టు మొదలు పెట్టడానికి ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.సో దీన్ని బట్టి చూస్తే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ “మహాభారతం” రాజమౌళి కంటే ముందుగానే త్రివిక్రమ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు ఇండస్ట్రీలో సరికొత్త టాక్ వినపడుతోంది.
.