యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమా పూర్తి కాకముందే తన నెక్ట్స్ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.ఎన్టీఆర్ 30వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాను ఇప్పటికే అనౌన్స్ కూడా చేశాడు తారక్.
అయితే గతంలో అరవింద సమేత అనే బ్లాక్బస్టర్ మూవీని త్రివిక్రమ్ అందించగా, ఈసారి ఎలాంటి సినిమాతో వస్తారా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
కాగా ఈసారి తారక్ కోసం ఓ పవర్ఫుల్ పొలిటికల్ బ్యాక్డ్రాప్ మూవీని తెరకెక్కించనున్నాడు త్రివిక్రమ్.
ఇక ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్థినకు’ అనే టైటిల్ను పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.కాగా ఈ సినిమాలో ఓ కీలక రాజకీయ నేత పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్నాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమా కేవలం పొలిటికల్ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా సామాజిక అంశాలను కూడా కలిగి ఉంటుందట.ఈ సినిమా గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ మాదిరిగా ఉండబోతుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏదేమైనా మరోసారి తారక్, మోహన్ లాల్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా జనతా గ్యారేజ్కు రీలోడెడ్ వర్షన్ అనే టాక్ వినిపిస్తుంది.మరి ఈ సినిమాలో మోహన్ లాల్ నిజంగానే నటిస్తున్నాడా లేక ఇదంతా కేవలం పుకారేనా అనే విషయంపై క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.
ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా పూజా హెగ్డేతో పాటు శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ను తీసుకోవాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నాడు.