మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి అల వైకుంఠపురములో అనే సినిమాను తెరకెక్కించి అదిరిపోయే బ్లాక్బస్టర్ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఈ సినిమా అందించిన సక్సెస్తో ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని యంగ్ టైగర్ ఎన్టీఆర్తో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.
ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్గా స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్, త్వరలోనే ఈ సినిమా షూటింగ్ను కూడా ప్రారంభించాలని చూస్తున్నారు.
అయితే ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తుండటంతో, ఆ సినిమా ఇంకా పూర్తి కాలేదని ఈ సినిమాను ప్రారంభించలేకపోయారు.
అటు కరోనా వైరస్ ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది.కాగా ఈ సినిమా కోసం తారక్ మరికొంత సమయం అడగడంతో త్రివిక్రమ్ కూడా ఈ గ్యాప్లో వేరే సినిమా చేస్తాడనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే త్రివిక్రమ్ మాత్రం ఇప్పట్లో వేరే సినిమా తీయాలనే ఆలోచనలో లేడట.
కేవలం తారక్తో తెరకెక్కించే చిత్రంపైనే తన ఫోకస్ పెట్టాడట ఈ డైరెక్టర్.
పూర్తి పొలిటికల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందించేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు.‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాతో తారక్ మరోసారి ‘అరవింద సమేత’ను మించిన విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు.మరి ఈ సినిమాను త్రివిక్రమ్ ఎలా తెరకెక్కిస్తాడా అనే అంశం తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.