మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కువగా పెద్ద హీరోలతోనే సినిమాలు చేస్తూ ఉంటారు.ఎప్పుడైనా సమయం దొరికితే చిన్న హీరోల చిత్రాలకి కథలు అందించడం, ఇంకా అవకాశం ఉంటే దర్శకత్వం చేయడం చేస్తున్నాడు.
అలా వచ్చిందే నితిన్ అఆ మూవీ.చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ పెద్ద హిట్ అయ్యింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాని సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే.సర్కారు వారి పాట మూవీ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
అయితే దానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.త్రివిక్రమ్, మహేష్ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి వచ్చే ఏడాది వరకు సమయం పట్టిన ఆశ్చర్యం లేదు.
ఇదిలా ఉంటే ఇంతలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ చిన్న సినిమాని స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యాడు.ఇక మెగా హీరో రామ్ చరణ్ తన స్నేహితుడు శర్వానంద్ కి సాలిడ్ సక్సెస్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యి త్రివిక్రమ్ ని సంప్రదించడం జరిగిందని టాక్.ఈ నేపధ్యంలో శర్వానంద్ కోసం త్రివిక్రమ్ ఓ మంచి కథని సిద్ధం చేసాడని ఈ మూవీని స్టార్ట్ చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.రామ్ చరణ్ ఈ మూవీని నిర్మించబోతున్నట్లు సమాచారం.
హారికా హాసిని కూడా ఈ మూవీలో భాగస్వామ్యం అవుతుందని ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.వీలైనంత వేగంగా త్రివిక్రమ్ శర్వానంద్ తో మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి తక్కువ టైంలో పూర్తి చేసే విధంగా షెడ్యూల్ చేసుకుంటున్నారని సమాచారం.
త్వరలో ఈ మూవీకి సంబంధించి అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.