టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ చిత్రాన్ని ఎవరితో చేస్తాడా అనే అంశం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.గతకొంత కాలంగా స్టార్ డైరెక్టర్ రాజమౌళితో మహేష్ ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తూ వచ్చింది.
దీంతోపాటు మరో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్తో కూడా మహేష్ ఓ చిత్రాన్ని చేస్తాడని ఫిలింనగర్లో వార్తలు వినిపించాయి.అయితే ఈ ఇద్దరు డైరెక్టర్స్లో మహేష్ ఎవరితో సినిమా చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
కాగా తాజాగా మహేష్ నెక్ట్స్ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ను చిత్ర యూనిట్ ప్రకటించింది.
మహేష్ కెరీర్లో 28వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ వెల్లడించింది.
గతంలో మహేష్తో అతడు, ఖలేజా వంటి చిత్రాలు తెరకెక్కించిన త్రివిక్రమ్, ఇప్పుడు మరోసారి మహేష్తో సినిమా చేయనున్నాడు.ఈ సినిమా షూటింగ్ను కూడా అతిత్వరలో ప్రారంభించి, ఈ సినిమాను 2022 వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటుల గురించిన వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.మొత్తానికి మహేష్లో అదిరిపోయే హ్యాట్రిక్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ సాలిడ్గా రెడీ అవుతున్నాడు.