టాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు కానుకగా మే 31 న అనౌన్స్ మెంట్ వస్తుందని అందరూ ఇప్పటి వరకు అనుకున్నారు.
కానీ ఏం జరిగిందో తెలియదు ఈ రోజు వీరి నుండి సినిమా అనౌన్స్ మెంట్ రాబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.
అతడు సూపర్ హిట్ అవ్వగా ఖలేజా మాత్రం ఆకట్టుకోలేక పోయింది.అతడు సినిమా ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించగా ఖలేజా సినిమాను కామిడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు.
ఈ రెండు సినిమాలు మహేష్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలుగా నిలిచాయి.
ఇప్పుడు రాబోతున్న సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.అయితే వీరి కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమాను ఒక రేంజ్ లో తీయబోతున్నాడని సమాచారం.ఈ సినిమాను ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్ అన్ని కలిపి అతడు సినిమాలాగే ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్.
ప్రస్తుతం ఈయన ఈ సినిమా కథను రెడీ చేసే పనిలో ఉన్నాడట.
ఈ సినిమా హాసిని అండ్ హారిక బ్యానర్ లో నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మళ్ళీ పది సంవత్సరాల తర్వాత వీరి కాంబినేషన్ రాబోతుందని అభిమానులంతా ఆసక్తిగా చూస్తున్నారు.ఈ సినిమాను మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో #SSMB28 హ్యాష్ టాగ్ తో ఇప్పటికే ట్రెండింగ్ చేసారు.
మరి సోషల్ మీడియాలో వస్తున్నా వార్తల ప్రకారం ఈ సినిమా అనౌన్స్ మెంట్ ఈ రోజు వస్తుందో లేదో చూడాలి. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వం లో ‘సర్కారు వారి పాట‘ సినిమా చేస్తున్నాడు.