మహేష్బాబు కెరీర్లో అతడు చాలా ప్రత్యేకమైన సినిమా.ఆ సినిమా కమర్షియల్గా హిట్ కాకున్నా కూడా అదో అద్బుతమైన ప్రయోగం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ సమయంలో ఆ సినిమా వచ్చి ఉంటే కమర్షియల్గా వంద కోట్లకు మించి వసూళ్లు నమోదు అయ్యేవి అనేది కొందరి వాదన.ప్రస్తుతం టీవీల్లో వస్తున్న ఈ సినిమాకు వచ్చే టీఆర్పీ రేటింగ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆ సినిమా తర్వాత మళ్లీ మహేష్బాబు, త్రివిక్రమ్ల కాంబోలో ఖలేజా చిత్రం వచ్చింది.ఆ సినిమా నిరాశ పర్చింది.అయితే టీవీలో ఖలేజా కూడా మంచి టీఆర్పీ రేటింగ్ను దక్కించుకుంది.ఇప్పటి వరకు టీవీలో వచ్చిన ప్రతి సారి కూడా ఖలేజా మంచి రేటింగ్తో దూసుకు పోతుంది.
అందుకే మళ్లీ మహేష్బాబు, త్రివిక్రమ్ల కాంబో మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందో అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబో మూవీ వచ్చే ఏడాదిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది అంటున్నారు.
మహేష్, త్రివిక్రమ్ల మద్య దర్శకుడు హీరో బంధం మాత్రమే కాకుండా మంచి స్నేహం కూడా ఉంది.అందుకే వీరిద్దరి కాంబో మూవీ గురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడు సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్బాబుతో ఒక పాన్ ఇండియా సినిమాను త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట.ఆ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ కూడా మహేష్కు చెప్పడం ఆయన ఓకే చెప్పడం జరిగిందట.
ఎన్టీఆర్తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడు.ఆ తర్వాత మహేష్తో మూవీ ఉంటుందని తెలుస్తోంది.