మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురములో సినిమాతో గత సంవత్సరం భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్ల పరంగా కుమ్మేసింది.
అంత పెద్ద హిట్ వచ్చాక కూడా త్రివిక్రమ్ ఇప్పటి వరకు తర్వాత సినిమా మొదలు పెట్టలేదు.ఆ హీరోతో చేస్తున్నాడు ఈ హీరోతో చేస్తున్నాడు అంటూ చాలా వార్తలు వినిపించాయి.
మహేష్ తో చేయబోతున్నట్టు ప్రకటించాడు.వీరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.ఈ సినిమాల్లో అతడు సూపర్ హిట్ అవ్వగాఖలేజా మాత్రం ఆకట్టుకోలేక పోయింది.అయితే ఈ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి బాగానే ఉంది.
తాజాగా త్రివిక్రమ్ ఒక స్క్రిప్ట్ ను అమ్మడానికి రెడీ అయినట్టు వార్తలు వస్తున్నాయి.
ఏ కథ మరేదో కాదు పవన్ కళ్యాణ్ తో చేయాలనుకున్న కోబలి కథ.పవన్ తో అత్తారింటికి దారేది సినిమా హిట్ అయిన సమయంలోనే కోబలి సినిమాను ప్రకటించాడు.కథ అంత సిద్ధం చేసుకున్న తర్వాత కొన్ని కారణాల వలన వాయిదా పడింది.
కానీ ఈ సినిమా కథ ఇప్పటికి త్రివిక్రమ్ దగ్గర ఉంది.అయితే పవన్ తో సినిమా చేయాలనీ ఉన్న ఇప్పట్లో ఇది సాధ్యం కానీ విషయం.
ఎందుకంటే ఇప్పటికే పవన్ చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు.ఇంకా త్రివిక్రమ్ తో సినిమా చేయాలంటే మూడు నాలుగు సంవత్సరాలు వేచి ఉండాల్సిందే.అయితే త్రివిక్రమ్ ఈ కథను ఎప్పటికప్పుడు కాలానికి అనుగుణంగా మార్చుతూ ఉన్నాడు.ఇలా మళ్ళీ మళ్ళీ రీవర్క్ చేయాల్సి వస్తుంది.
అందుకే త్రివిక్రమ్ ఈ సినిమా కథను అమ్మడానికి సిద్ధం అయ్యాడని టాక్ నడుస్తుంది.పవన్ తో సినిమాలు చేసే డైరెక్టర్లలో ఎవరికైనా ఈ స్క్రిప్ట్ ఇచ్చేందుకు త్రివిక్రమ్ చూస్తున్నాడట.
ప్రస్తుతం ఆ కథను పూర్తిగా రెడీ చేసే పనిలో ఉన్నాడట.చూడాలి మరి త్రివిక్రమ్ నిజంగానే ఈ స్క్రిప్ట్ ను అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నాడో లేదో.