మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా కు తెలుగులో రీమేక్ చేస్తున్నారు.పవన్ మరియు రానాలు నటిస్తున్న ఈ రీమేక్ కు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.
అయితే ఈ సినిమా కు మాటలు మరియు స్క్రీన్ ప్లేను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ అందిస్తున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది.ఇక ఈ సినిమా చిత్రీకరణ తాజాగా ప్రారంభం అయ్యింది.
సాదారణంగా అయితే మాటల రచయిత మరియు స్క్రీన్ ప్లే రచయితలకు ఎక్కువగా ఆన్ సెట్స్ పని ఉండదు.కాని మొదటి రోజు షూటింగ్ సందర్బంగా త్రివిక్రమ్ హాజరు అవ్వడంతో చాలా మంది ఈ సినిమా మొత్తం బాధ్యత త్రివిక్రమ్ చూసుకుంటున్నాడు.
సినిమా షూటింగ్ వ్యవహారం మొత్తం కూడా త్రివిక్రమ్ చూసుకుంటున్నాడు.అంటే సాగర్ చంద్ర కేవలం పేరుకు మాత్రమే అని, ఈ సినిమాకు షాడో డైరెక్టర్ గా త్రివిక్రమ్ వ్యవహరిస్తున్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి ఈ సినిమా షూటింగ్ సందర్బంగా త్రివిక్రమ్ కనిపించడంతో చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.సాగర్ చంద్ర సినిమా సక్సెస్ అయినా క్రెడిట్ దక్కించుకోవడం కష్టమే అన్నట్లుగా కొందరు వ్యాఖ్యలు చేస్తుంటే మరి కొందరు మాత్రం త్రివిక్రమ్ తో పవన్ సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయి.కనుక సాగర్ చంద్ర పేరు చెప్పి సినిమాను తానే చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి పవన్ మరియు త్రివిక్రమ్ ల కాంబో మూవీ వస్తున్నందుకు అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.
షూటింగ్ మొదలైన ఈ సినిమాను ఇదే ఏడాది లో విడుదల చేస్తామని యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.దాంతో సినిమా పవన్ అభిమానుల ఆనందంకు అవధులు లేవు.
ఈ సినిమా చిత్రీకరణ కేవలం 45 రోజుల్లోనే పూర్తి చేస్తారని సమాచారం అందుతోంది.అదే నిజం అయితే సినిమాను దసరా వరకు విడుదల చేసే అవకాశం ఉంది.