పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలని సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నారు.ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేయడంతో పాటు, సంక్రాంతిసందర్భంగా టీజర్ కూడా రిలీజ్ చేశారు.
మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన టీజర్ కావడం భారీ స్పందన వచ్చింది.ఇక టీజర్ తోనే సినిమా మీద అంచనాలు కూడాపెరిగిపోయాయి.
ఇదిలా ఉంటే మరో వైపు క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ మూవీ షూటింగ్ ప్రారంభమైపోయింది.అలాగే సాగర్ చంద్ర దర్శకత్వంలో అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ షూటింగ్ కూడా ప్రారంభం అయిపొయింది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ రెండు సినిమాల షూటింగ్ ఒకే సారి పూర్తి చేయడానికి రెడీ అయ్యాడు.బ్యాక్ టూ బ్యాక్ షూటింగ్ చేసి వీలైనంత వేగంగా సినిమా షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే అయ్యప్పన్ కోషియమ్ సినిమాకి సంబంధించి మరో అప్డేట్ ని చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ సినిమాకి స్క్రీన్ ప్లే మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారని రివీల్ చేశారు.
ఇప్పటికే ఈ విషయం అందరికి తెలుసు.అయితే అఫీషియల్ గా చిత్ర యూనిట్ నుంచి మాత్రం తాజాగా క్లారిటీ వచ్చింది.
ఈ స్క్రీన్ ప్లే, మాటలు అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు కూడా త్రివిక్రమ్ చూసుకుంటున్నారని తెలుస్తుంది.ఓవిధంగా చెప్పాలంటే సాగర్ చంద్ర సినిమా అయినా త్రివిక్రమ్ స్టైల్ లోనే ఈ సినిమా ఉండబోతుందని బోగట్టా.
ఫస్ట్ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో సన్నివేశాలు పూర్తి చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.