త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటే కచ్చితం ఏదో ఒక స్టార్ హీరోతోనే ఉంటుంది అని ఆడియన్స్ బలంగా ఫిక్స్ అయిపోతారు.కేవలం స్టార్ హీరో లకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ తన కథలని రాసుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్ పూరీ తరహాలో కొత్త హీరోలని పరిచయం చేసే బాద్యత ఇప్పటి వరకు తీసుకోలేదు.
అయితే త్రివిక్రమ్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా పరిచయం అయితే అతని ఎలివేషన్ మాత్రం గట్టిగా ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేది.అందుకనే ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త తన కొడుకుని ఎలా అయిన త్రివిక్రమ్ దర్శకత్వంలో హీరోగా పరిచయం చేయాలని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఒక వ్యాపార వేత్త తన తనయుడిని హీరోగా పరిచయం చేయడానికి రంగం సిద్ధం చేసుకొని భారీ ప్రాజెక్ట్ తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు.పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాని నిర్మించడానికి 170 కోట్ల బడ్జెట్ తో సిద్ధంగా ఉండటంతో పాటు ఆ సినిమాకి దర్శకుడుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఎంపిక చేసుకున్నట్లు టాక్ బలంగా వినిపిస్తుంది.
ఈ సినిమా కోసం త్రివిక్రమ్ కు పారితోషికంగా 35 కోట్లు ముట్టనున్నట్టు చెబుతున్నారు.ఎన్టీఆర్ తరువాత చరణ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ ఒక సినిమా చేయవలసి వుంది.ఆ ప్రాజెక్టు ఆలస్యమైతే త్రివిక్రమ్ ఈ కొత్త కుర్రాడితో సినిమా చేస్తాడని చెప్పుకుంటున్నారు.అయితే ఆ బడా వ్యాపారవేత్త ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి ఇండస్ట్రీలో సస్పెన్స్ గా ఉంది.