నార్మల్ పర్సన్స్తో పోలిస్తే సెలబ్రిటీల లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుందన్న సంగతి అందరికీ విదితమే.వారి ఇల్లు, కార్లు, లివింగ్ అట్మాస్పియరిక్ కండిషన్స్ అన్నీ విలాసవంతంగా ఉంటాయి.
కాగా, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు లైఫ్ స్టైల్ కూడా డెఫినెట్గా విలాసవంతంగానే ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ క్రమంలోనే ఆయన ఇల్లు కోసం ఏకంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట.
అయితే, ఆ ఇంటిలో మహేశ్ కలకాలం నివసించబోరు.సినిమా షూటింగ్ కోసమే ఆ ఇల్లును నిర్మిస్తున్నారు.
టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ కోసం ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
ఈ చిత్రంలో ఓ హౌజ్ సెట్ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఏ.ఎస్.ప్రకాష్ ఓ భారీ సెట్ నిర్మించారని సమాచారం.హీరో ఉండే ఈ హౌజ్ కోసం సుమారు రూ.5 కోట్లు ఖర్చు చేస్తున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.ఈ చిత్రం మహేశ్ బాబుకు 28వ సినిమా కాగా, ఈ సినిమాలో మహేశ్కు జోడీగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆస్థాన హీరోయిన్ టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోందిఅతడు, ఖలేజాచిత్రాల తర్వాత దాదాపు పదకొండు ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ -మహేశ్ కాంబోలో మళ్లీ సినిమా రాబోతున్నది.హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్.రాధ కృష్ణ (చినబాబు) ఈ ఫిల్మ్ను ప్రొడ్యూస్ చేస్తున్నారు.
గీతా గోవిందం ఫేమ్ డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాటచిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది.ఇందులో మహేశ్ బాబు బ్యాంకర్గా కనిపించనున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్.
మహేశ్ సరసన క్యూట్ కీర్తి సురేశ్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.