దొంగ స్వామీ గుట్టురట్టు చేస్తోన్న త్రివిక్రమ్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Trivikram Chiranjeevi Movie Backdrop, Trivikram, Chiranjeevi, Acharya, Tollywood-TeluguStop.com

ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమా తరువాత చిరు తన నెక్ట్స్ చిత్రాన్ని ఓకే చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయాలని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భావించాడు.కానీ ఎందుకో ఈ కాంబోలో సినిమా పట్టాలెక్కలేదు.

దీంతో ఇప్పుడు మరోసారి చిరంజీవితో త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.అయితే ఈసారి చిరంజీవి కోసం ఓ క్రైమ్ డ్రామా కథను త్రివిక్రమ్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.

ఈ కథలో ఓ దొంగ స్వామీజీ బండారం ఎలా బట్టబయలు అయ్యిందనేది చాలా ఆసక్తిగా చూపించనున్నాడట త్రివిక్రమ్.కాగా ఈ కథ చిరుకు బాగా నచ్చడంతో ఈ సినిమా చేసేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం చిరు ఆచార్య సినిమాతో బిజీగా ఉండటం, అటు త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉండటంతో, ఈ ఇద్దరు కలిసి సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.కాగా చిరు-త్రివిక్రమ్ కాంబోలో ఖచ్చితంగా సినిమా ఉంటుందని, అది అతిత్వరలో పట్టాలెక్కడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

మరి ఈ మెగా ప్రాజెక్టును ఎప్పుడు ప్రారంభిస్తారో చూడాలి.ఏదేమైనా ఈ కాంబోలో సినిమా వస్తే అది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube