పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల’ సినిమా తర్వాత నటిస్తున్న సినిమా ‘గబ్బర్సింగ్`2’.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దాదాపు సంవత్సర కాలంగా ఈ సినిమా షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది.ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లబోతున్నట్లుగా నిర్మాత శరత్ మరార్ ప్రకటించాడు.
అందుకు సంబంధించిన చివరి దశ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని ఆయన పేర్కొన్నాడు.ఇక ఈ సినిమాలో హీరోయిన్గా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి.
తాజాగా త్రిష పేరు ప్రచారం జరుగుతోంది.
‘తీన్మార్’ సినిమాలో పవన్ కళ్యాణ్ మరియు త్రిషలు జంటగా నటించిన విషయం తెల్సిందే.
ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా వీరిద్దరి రొమాన్స్కు మంచి పేరు వచ్చింది.ఆ తర్వాత వీరిద్దరు కలిసింది లేదు.
అయితే ఇన్నాళ్లకు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ వర్కౌట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ఇటీవలే పవన్ కళ్యాణ్కు జోడీగా నటించే ఆఫర్ వచ్చినట్లుగా త్రిష తన సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చినట్లుగా తెలుస్తోంది.
త్రిష కూడా అందుకు ఓకే చెప్పిందట.అయితే కొందరు మాత్రం ‘గబ్బర్సింగ్`2’లో కాకుండా పవన్ నటించబోతున్న ఆ తర్వాత సినిమాలో త్రిషను హీరోయిన్గా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.‘గబ్బర్సింగ్`2’ తర్వాత పవన్ కళ్యాణ్ తన తర్వాత సినిమాను దాసరి నారాయణ రావు నిర్మాణంలో చేసే అవకాశాలున్నాయి.