నటినటులు గాయకుల అవతారం ఎత్తడం కొత్తేమి కాదు .అప్పటి భానుమతి నుంచి నేటి స్వాతి దాకా అంతా ఎప్పుడోకప్పుడు తమ గాత్రాన్ని బయట పెట్టినవారే.
మన టాప్ హీరోలు కూడా ఓ గొంతేసిన దాఖాలాలు ఉన్నాయి.బిజినెస్ మెన్ లో మహేష్ మేరిపించాగా, అత్తారింటికి దారేదిలో పవన్ మురిపించాడు.
శృతి హసన్ అయితే, ముందు గాయని, తర్వాతే నటి.ఇప్పుడు ఈ లిస్టులోకి మరో ముద్దుగుమ్మ చేరనుంది.
అవును, త్రిష పాట పాడబోతోందంటా.తన తదుపరి చిత్రం “నాయకి” లో త్రిష గాత్రం వినిపించనుంది.ఈ క్రెడిట్ అంతా సంగీత దర్శకుడు “రఘు కుంచె” కి ఇవ్వాల్సిందే.ఆయనే మరి త్రిష ని ఒప్పించింది.
అందమైన త్రిష తన అందమైన గొంతుతో పాట పాడితే అది ఇంకెంత అందంగా ఉంటుందో.