డిప్రెషన్‌లోకి వెళ్లిన త్రిష.. అందుకే గుడ్ బై!

బాలీవుడ్‌లో యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నిన్న ఆత్మహత్య చేసుకోవడంతో అన్ని ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.ఇలా ఓ ట్యాలెంటెడ్ హీరో హఠాన్మరణం పొందడంతో అందరూ అవాక్కయ్యారు.

 Trisha Takes Break From Social Media, Trisha, Social Media, Depression, Tollywoo-TeluguStop.com

కాగా సుశాంత్ మృతిపట్ల అందరూ తమ సానుభూతిని తెలుపుతున్నారు.అయితే ఇలాంటి వార్తలు వినడం వల్ల తాను తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లానంటూ ఓ హీరోయిన్ ఏకంగా తన ఫ్యాన్స్‌కు గుడ్ బై చెప్పేసింది.

తమిళ స్టార్ బ్యూటీ త్రిష ప్రస్తుతం వరుసబెట్టి సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ బ్యూటీ గతకొంత కాలంగా తీవ్ర డిప్రెషన్‌లో ఉన్నట్లు ఆమె సన్నిహితులు తెలిపారు.

తన ప్రేమ వ్యవహారం ఫెయిల్యూర్‌గా మిగలడం, అటుపై కొన్ని పర్సనల్ విషయాల్లో త్రిష బాగా హర్ట్ కావడం లాంటి అంశాల వల్ల త్రిష తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.కాగా ఈ బ్యూటీ తాజాగా సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఘటనతో మరింత డిస్ట్రబ్ అయ్యినట్లు తెలుస్తోందని కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ ఆమె మానసికంగా చాలా డిస్ట్రబ్‌గా ఉందని, అందుకే కొన్ని రోజులు అన్నింటికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.దీంతో ఆమె కొంతకాలం పాటు డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉండాలని, అందుకే తన సోషల్ మీడియా అకౌంట్‌లకు ఆమె దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

దీంతో తన ఫ్యాన్స్‌కు గుడ్‌బై చెప్పి ఆమె సోషల్ అకౌంట్స్ నుండి తాత్కాలికంగా తప్పుకుంది.త్వరలోనే మళ్లీ తన ఫ్యాన్స్‌ను సోషల్ మీడియాలో పలకరిస్తానని ఆమె చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube