టాలీవుడ్ తెరపై ఒక దశాబ్దం పైగానే టాప్ హీరోయిన్ గా కొనసాగిన త్రిష కొన్ని రోజులుగా తెలుగు తెరకు దూరం అయ్యింది.తెలుగులో డైరెక్ట్ సినిమా చేసి చాలా రోజులయ్యింది.
అప్పుడప్పుడు డబ్బింగ్ సినిమాలతో పలకరిస్తుంది.కానీ డైరెక్ట్ తెలుగు సినిమా మాత్రం చెయ్యడం లేదు.
ఈ మధ్య తెలుగులో సీనియర్ హీరోల సరసన అవకాశాలు వచ్చినప్పటికీ ఏదో కారణాల వల్ల వాటి నుండి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే త్వరలోనే మరొక తెలుగు సినిమాతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
మెగాస్టార్ సరసన ఆచార్య సినిమాలో, గోపీచంద్ మలినేని బాలయ్య కాంబినేషన్ లో వస్తున్నా సినిమాలో కూడా త్రిషనే మొదటగా అనుకున్నారట.కానీ కొన్ని కారణాల వల్ల త్రిష మంచి అవకాశాలను వదులుకుంది.
అయితే ఇప్పుడు మహేష్ సరసన అవకాశం అందుకుందని టాక్ నడుస్తుంది.
అయితే మెయిన్ హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను అనుకుంటుండగా సెకండ్ హీరోయిన్ గా త్రిష పేరు వినిపిస్తుంది.అయితే త్రిష ఓకే అంతుందా లేదా అనేది తెలియాలి.ఇప్పటికే మహేష్ సరసన త్రిష హీరోయిన్ గా చేసింది.
వీళ్ళ పెయిర్ కూడా సూపర్ హిట్ అయ్యింది.అయితే ఏ క్యారెక్టర్ కోసం త్రిషను తీసుకుంటున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కోసం నివేద థామస్, నిధి అగర్వాల్ పేర్లు కూడా వినిపించాయి.అయితే వీళ్లల్లో ఎవరిని ఆ ఛాన్స్ వరిస్తుందో తెలియాల్సి ఉంది.
అయితే ఈ సినిమా ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు.ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమా షూటింగ్ చేస్తూ బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత త్రివిక్రమ్, మహేష్ కాంబోలో సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.చూడాలి మరి ఈ సినిమాలో త్రిష ఛాన్స్ అందుకుంటుందో లేదో.