టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే ఏ హీరోయిన్ అయిన కనీసం కథ కూడా వినకుండా వెంటనే ఒకే చెప్పేస్తుంది.అతనితో కలిసి నటించడమే అదృష్టంగా భావిస్తారు.
అవకాశం వచ్చిందంటే సంబరపడిపోతారు.అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా విషయంలో రివర్స్ జరిగింది.
ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రస్తుతం ఫేడ్ అవుట్ దశలో ఉన్న త్రిషని హీరోయిన్ గా కొరటాల ఫైనల్ చేశారు.ఇక ఈ అమ్మడు తాజాగా షూటింగ్ లో కూడా పాల్గొంది.
అయితే ఉన్నపళంగా అందరికి మైండ్ బ్లాంక్ అయ్యే న్యూస్ చెప్పింది.
చిరంజీవి ఆచార్య సినిమా నుంచి తప్పుకున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
క్రియేటివ్ డిఫర్సెన్స్ వల్ల నేను చిరంజీవిగారి ‘ఆచార్య’ సినిమాలో నటించడం లేదు.త్వరలో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్తో నా తెలుగు అభిమానులను కలుస్తాను అని పోస్ట్ చేసింది.
అసలు చిరంజీవి సినిమాతో క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చేంత సమస్య త్రిషకి ఏమొచ్చింది అంటూ ఇప్పుడు ఆ పోస్ట్ చూసిన వారు కామెంట్స్ పెడుతున్నారు.అయితే రెమ్యునరేషన్ విషయంలో అమ్మడు కాస్తా ఎక్కువ డిమాండ్ చేయడం జరిగిందని, కొరటాల దీనికి అంగీకరించలేదని, ఈ కారణంగా ఆమె సినిమా నుంచి తప్పుకున్నట్లు చర్చించుకుంటున్నారు.
అయితే ఏం జరిగింది అనేది మాత్రం వాస్తవం తెలియడం లేదు.