టాలీవుడ్ లో లవర్ బాయ్ తరుణ్ నటించినటువంటి “నీ మనసు నాకు తెలుసు” అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది
త్రిష
.అయితే అప్పటి నుంచి తన అందం అభినయంతో పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటూ వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఒకప్పుడు
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల
సరసన కొనసాగింది ఈ అమ్మడు.
అయితే మధ్యలో ఏమైందో ఏమోగానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు కొంత కాలం పాటూ తెలుగు సినీ పరిశ్రమకు దూరం అయింది.అయినప్పటికీ అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూనే తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది.
అయితే తాజాగా ఇటీవలే త్రిష కి సంబంధించినటువంటి కొన్ని చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఈ ఫోటోని స్వయంగా త్రిష తన అధికారిక
ఇంస్టాగ్రామ్ ఖాతా
ద్వారా షేర్ చేసింది.
దీంతో పలువురు ఈ ఫోటోని తెగ ట్రోల్ చేస్తున్నారు.అలాగే కొందరు టీచర్లు చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉన్నావు అంటూ ఆమె అందాన్ని పొగుడుతూ ఉన్నారు.
మరికొందరు మాత్రం అప్పటికీ ఇప్పటికీ నీ అందం లో మాత్రం ఎటువంటి మార్పు రాలేదని వన్నె తరగని అందం నీది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ అమ్మడు ప్రస్తుతం పలు
కోలీవుడ్
చిత్రాల్లో నటిస్తోంది.అయితే తెలుగులో కూడా ప్రముఖ దర్శకుడు
కొరటాల శివ
దర్శకత్వం వహిస్తున్న ఆచార్య అనే చిత్రంలో టాలీవుడ్
మెగాస్టార్ చిరంజీవి
సరసన నటించే అవకాశం దక్కించుకుంది.కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ చిత్రం నుంచి తప్పుకుంది.