త్రిపుర అసెంబ్లీ ఎన్నికల బీజేపీ జాబితా విడుదలైంది.48 మందితో కూడిన తొలి జాబితాను పార్టీ అధిష్టానం రిలీజ్ చేసింది.ఈ మేరకు టౌన్ బోర్డోవాలి నుంచి సీఎం మాణిక్ సాహా బరిలో నిలువనున్నారని తెలుస్తోంది.
అయితే త్రిపుర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కాగా నామినేషన్లను 30 వ తేదీ వరకు స్వీకరించనున్నారు.
నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ 30తో ముగియనుండగా.నామినేషన్ల ఉపసంహారణకు చివరి తేదీ ఫిబ్రవరి 2 అని పేర్కొన్నారు.
అదేవిధంగా ఫిబ్రవరి 16న ఎన్నికల పోలింగ్ జరగనుంది.ఓట్ల లెక్కింపు ప్రక్రియ మార్చి 2వ తేదీన నిర్వహించనున్నారు.
రిజల్ట్ కూడా అదే రోజు వెలువరించే అవకాశం ఉంది.