ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద భవనాలు అమాంతం కుప్పకూలి పోవడం లాంటి సంఘటనలు చాలానే చూస్తున్నాం.ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఆశ్చర్య పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది.చూస్తుండగానే క్షణాల్లో మూడు అంతస్తుల భవనం కుప్పకూలి పోయింది.
అయితే ఈ మూడు అంతస్తుల భవనం కుప్పకూలే సమయానికి అందులో నివసించే కుటుంబీకులు బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది.దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లా నిశ్చింతపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
సాగు నీటి కాలువ పక్కన మూడు అంతస్తుల భవనాలు నిర్మించారు.
భారీ వర్షాల కారణంగా కాలువలో పూడిక ఏర్పడడంతో… పూడిక తీసే పనులు చేపట్టారు అధికారులు.దీంతో సదరు కాలువ పక్కనే ఆనుకుని ఉండే భవనం పునాదులు ఒక్కసారిగా కదిలి పోయాయి.
దీంతో గాలివాన తో చెట్లు ఒరిగి పోయినట్లుగా మూడంతస్తుల భవనం కాలువలోకి ఒరిగిపోయింది.దీంతో తీవ్ర భయాందోళనకు గురైన అందులో నివసిస్తున్న కుటుంబీకులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.
అటు వెంటనే కాలువలోకి ఒక్కసారిగా భవనం కుప్పకూలి పోయింది.ఈ వీడియోను ఒక నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.
అయితే కాలువ పక్కనే గట్లు ఎంతో బలహీనంగా మట్టి వదులుగా ఉంటాయి అని తెలిసినప్పటికీ… మూడంతస్తుల భవనం ఎలా నిర్మించారు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఇక ఈ ఘటన ఒక్కసారిగా సంచలనం అవ్వడంతో అప్రమత్తమైన అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.