మేం వయసుకి వచ్చాము సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతో పర్వాలేదనిపించుకున్న త్రినాథ్ రావు నక్కిన రాజ్ తరుణ్ తో సినిమా చూపిస్త మామాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సక్సెస్ ఫుల్ కెరియర్ ట్రాక్ ని మొదలు పెట్టారు.తరువాత నానితో నేను లోకల్ అంటూ మరో సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నారు.
ఈ రెండు సినిమాలతో అందరి దృష్టిని తన వైపుకి తిప్పుకున్న త్రినాథ్ రావు నెక్స్ట్ సినిమా సురేష్ కోసం చాలా మంది అడ్వాన్స్ లు ఇచ్చారు.ఈ నేపధ్యంలో రామ్ తో హలొ గురు ప్రేమ కోసమే అంటూ రొమాంటిక్ లవ్ స్టోరీని తెరకెక్కించారు.
అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.ఆ సినిమా తర్వాత వెంకటేష్ తో నెక్స్ట్ సినిమా ఉంటుందని టాక్ నడిచింది.
అయితే ఎందుకనో ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు.గత ఏడాది రవితేజతో త్రినాథ్ రావు నక్కిన సినిమా ఫైనల్ అయ్యిందని టాక్ వినిపించింది.
రమేష్ వర్మ సినిమా తర్వాత ఆ సినిమా ఉంటుందని అనుకున్నారు.
అయితే ఇప్పుడు ఈ దర్శకుడు ఓ చిన్న హీరోగా తన నెక్స్ట్ సినిమాని ప్లాన్ చేసుకున్నారు.
జీనియస్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసి సక్సెస్ కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న హవీష్ తో సినిమా చేయబోతున్నారు.ఈ మధ్య హవీష్ నిర్మాతగా కూడా మారి పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నాడు.
నిర్మాతగా రాక్షసుడు సినిమాతో హిట్ కొట్టాడు.అయితే హీరోగా ఒక్క సక్సెస్ అయినా కొట్టాలనే అతని ప్రయత్నాలకు బ్రేకులు పడుతూనే ఉన్నాయి.
ఈ నేపధ్యంలో త్రినాథ్ రావు నక్కిన రీసెంట్ గా చెప్పిన కథకి ఒకే చెప్పాడు.ఈ సినిమాని హవీష్ తండ్రి కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు.
పక్కా కమర్షియల్ మాస్ స్టోరీతోనే త్రినాథ్ రావు గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.త్వరలో ఈ సినిమా అఫీషియల్ గా స్టార్ట్ అయ్యి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు బోగట్టా.