రామగుండంలో రెండు దశాబ్దాల క్రితం మూత పడిన ఆర్ఎఫ్సీఎల్కు మళ్లీ పునర్ వైభవం రానుంది.కాగా దేశంలో ఏటా 300 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను వినియోగిస్తుండగా 240 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది.
మిగిలిన 60 లక్షల మెట్రిక్ టన్నులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.ఈ ఆర్థిక భారాన్ని తగ్గించడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మూతపడిన ఐదు కర్మాగారాలను పునరుద్ధరించాలని నిర్ణయించింది.
ఇందులో మొదటగా తెలంగాణలో ఆర్ఎఫ్సీఎల్ సిద్ధమైంది.ఇప్పటికే ఈ కర్మాగారాన్ని ప్రారంభించాల్సి ఉండగా, కరోనా నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లిన రాజస్థాన్, ఒడిశాలకు చెందిన వలస కూలీలు తిరిగి రాకపోవడంతో పనులు చివరి దశలో నిలిచిపోయాయి.
కానీ కార్మికులు మళ్లీ రావడంతో కర్మాగార నిర్మాణపనులను దాదాపు పూర్తిచేశారు.ఇకపోతే రామగుండం ఎరువుల కర్మాగారంలో శనివారం అర్ధరాత్రి దాటాక 2.30 గంటలకు అధికారులు ట్రయల్రన్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి సంస్థ సీఈవో నిర్లప్ సింగ్ రాయ్ హాజరయ్యారు.రూ.6,180 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రాజెక్టును పునరుద్ధరిస్తున్నాయి.దీంతో ఈ పరిశ్రమలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేపనూనె పూత పూసిన యూరియాను ఉత్పత్తి చేయనున్నారట.కాగా ప్లాంట్ పూర్తిస్థాయి పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ ట్రయల్ రన్ ప్రారంభించినట్లు సీఈవో తెలిపారు.
ఇకపోతే ఏటా 13 లక్షల టన్నుల ఎరువులు ఉత్పత్తి చేయలనేది ఈ పరిశ్రమ లక్ష్యం అని ఈ సందర్భంగా వెల్లడించారు.