అమెరికాలో ప్రఖ్యాత టీవీ షో నిర్వహించే హోస్ట్ ట్రెవర్ నోహ్, కామెడీ షో లు చేయడంలో దిట్ట అయితే ఎదో ఒక సందర్భం తీసుకుని కామెడీ చేసుకునే అతడు.తన కామెడి కోసం భారత్ –పాక్ మధ్య జరిగిన యుద్దాన్ని కామెడీ గా తీసుకుని షో చేశాడు.
భారత్ , పాకిస్తాన్ మధ్య అణు యుద్ధం జరిగి ఉంటే కావలసినంత హాస్యం దొరుకుతుందని కామెడీగా మాట్లాడాడు.స్టేజ్ పై బాలీవుడ్ పాటలు పెట్టి హాస్యం చేస్తూ ఆ యుద్ధం మరో బాలీవుడ్ పాట అవుతుందని అన్నాడు.దాంతో అమెరికాలో ఉంటున్న భారత ఎన్నారైలు సదరు కమెడియన్ కి తమ ట్వీట్ లతో చుక్కలు చూపించారు.
రెండు దేశాల మధ్య యుద్దం కామెడీగా కనిపిస్తోందా, నువ్వు మనిషివేనా అంటూ ఒకరు, నీ హాస్యం కోసం యుద్దాన్ని వాడుకుంటావా అంటూ మరొకరు ఏకధాటిగా ఆటగాడిపై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.
దాంతో షాక్ తిన్న అతడు.తన ట్విట్టర్ ద్వారా క్షమాపణలు కోరాడు.కావాలని అనలేదని, తప్పు ఉంటే క్షమించాలని ట్రెవర్ కోరాడు .
.