ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా తెరకెక్కుతోంది.ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే సుకుమార్ అల్లు అర్జున్ దేవి కాంబినేషన్లో వచ్చిన ఆర్య, ఆర్య 2 అద్భుతమైన మ్యూజికల్ హిట్ అయ్యాయి.అయితే ఆ రెండు చిత్రాలకు మించి పుష్ప సినిమా ఉండబోతోందని చిత్రబృందం వెల్లడించారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.మాస్ మసాలా జోడించిన అల్లు అర్జున్ ఈ పాటలో ఎంతో మాస్ లుక్ లో కనిపిస్తూ అభిమానుల సందడి చేశారు.
అయితే ఈ సినిమాలో రెండవ పాట ఎంతో మెలోడీగా ఉండబోతోందని ఈ పాట పాడటం కోసం దేవి ట్రెండీ సింగర్ సిద్ద్ శ్రీరామ్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న పాటలు అన్నీ శ్రీరామ్ పాడటం చేత పుష్ప రెండో పాట ఎంతో మెలోడీగా ఉండబోతోందని, ఈ పాటను పాడటానికి సిద్ద్ శ్రీరామ్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఇదివరకే అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం సినిమాలో సామజవరగమన అనే పాటతో సందడి చేసిన శ్రీరామ్ మరోసారి పుష్ప సినిమాలో మరొక మెలోడీ పాట ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఇలా వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ మెలోడీ పాట ఎంతో అద్భుతంగా ఉంటుందని అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ పాట దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.