తెలంగాణ రాజకీయాలు కొద్ది రోజులుగా క్షణాల్లోనే మారిపోతున్నాయి.నిన్నట ఇవరకు తమకు ఎన్నికల్లో తిరుగులేదని భావించిన టీఆర్ఎస్కు దుబ్బాక, గ్రేటర్ ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి.
ఇక బీజేపీ ఇప్పటికే కేసీఆర్ విషయంలో దూకుడుగా ఉంది.ఇక తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరు ఎంపికవుతారన్నది ఇప్పటికే పెద్ద సస్పెన్స్గా ఉన్నా రేవంత్రెడ్డికే ఈ పదవి ఖాయమైందన్న ప్రచారం కూడా జరుగుతోంది.
ఇదిలా ఉండగానే కేసీఆర్కు కుడిభుజం అయిన మేళ్లచెరువు రామేశ్వరరావు అలియాస్ మై హోం రామేశ్వరరావు బీజేపీలో చేరుతున్నారని.ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేశారన్న వార్తలు కలకలంగా మారాయి.
వీటి సంగతి ఇలా ఉంచితే గత కొద్ది రోజులుగా రామేశ్వరరావుకు చెందిన మీడియా ఛానెల్స్లో రేవంత్ రెడ్డి టార్గెట్గా లెక్కలేనన్ని వ్యతిరేకత కథనాలు వచ్చాయి.వీటిని గంటలు గంటలుగా ప్రచారం చేశారు.
అలాంటిది ఇప్పుడు అదే రామేశ్వరరావుకు చెందిన ఛానెల్స్లో రేవంత్ వీరుడు, శూరుడు అంటూ కథనాలు మొదలయ్యాయి.నిన్నటి వరకు అసలు రేవంత్ పీసీసీ పదవి దక్కేందుకు అర్హుడే కాదని ప్రసారం చేసిన కథనాలు ఇప్పుడు రివర్స్ అయ్యాయి.
ఇంత సడెన్గా రామేశ్వరరావు ఎందుకు యూ టర్న్ తీసుకున్నాడన్న ప్రశ్నకు ఆనేక ఆన్సర్లు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో రామేశ్వరరావు టార్గెట్ గా బీజేపీ నేతలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ కూడా విమర్శలు చేస్తున్నారు.అయితే వీరి విమర్శలు కన్నా రేవంత్ రెడ్డి లాంటి బలమైన ప్రజాకర్షణ ఉన్న లీడర్ చేసే విమర్శలు బాగా పేలుతున్నాయి.మైం ఛానెల్స్ ద్వారా రేవంత్పై ఎన్ని విమర్శలు చేసినా రేవంత్ మాత్రం మై హోం అక్రమాలపై పోరాటం చేసే విషయంలో ఎంత మాత్రం వెనక్కు తగ్గడం లేదు.
ఇంత జరిగినా ధైర్యంగా పోరాడి చివరకు పీసీసీ రేసులో నిలబడ్డాడు.
ఇక ఇప్పుడు కేసీఆర్కు, మై హోం రామేశ్వరరావుకు ఎక్కడో తేడా వచ్చిందన్న ప్రచారం కూడా నడుస్తోంది.ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారన్న టాక్ కూడా నడుస్తోంది.దీంతో రేవంత్ రెడ్డి లాంటి బలమైన లీడర్తో పెట్టుకోవడం ఎందుకని మై హోం రామేశ్వరరావు రాజీకి వచ్చారని.
అందుకే ఇప్పుడు ఆయన ఛానెల్స్లో రేవంత్కు అనుకూలంగా పాజిటివ్ కథనాలు వస్తున్నాయని టాక్.?
.