ఫేస్బుక్ ఫేక్ అకౌంట్స్ పుణ్యమా అంటూ రోజు రోజుకు అనేకానేక ఆరోపణలు వస్తున్నాయి.అసలు ఏం జరిగిందంటే…ఫేస్బుక్ ను వాడుకుని ఒక టీచర్.
సాక్షాత్తూ పోలీసు భార్యనే ట్రాప్ చేశాడు.ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ సంఘటన లేట్ గా వెలుగులోకి వచ్చింది.
అసలు విషయానికి వస్తే.యూసుఫ్గూడ ప్రాంతంలో నివసించే ఓ ట్రాఫిక్ ఎస్సై భార్య ఇటీవల కనిపించకపోవడంతో జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.
కాగా, పోలీసుల విచారణతో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల హమాలీవాడలో నివాసించే చల్లా జ్ఞానేశ్వర్ కాసిపేట మండలంలోని మల్కెపల్లి ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.
ఫేస్బుక్లో యూసుఫ్గూడ ప్రాంతంలో పనిచేసే ట్రాఫిక్ ఎస్సై భార్య(48)తో స్నేహం చేశాడు.తనకు వివాహం కాలేదని నమ్మించాడు.
ఆమెను మల్కెపల్లి రప్పించి ఆశ్రమ పాఠశాలలో 15రోజులు ఉంచాడు.అక్కడ పాఠశాల సిబ్బంది అభ్యంతరం చెప్పడంతో మంచిర్యాలలో ఓ అద్దె ఇంట్లో ఆమెను ఉంచి తరచూ వచ్చిపోయేవాడు.
ఈ క్రమంలోనే కేసు విచారణ చేపట్టిన పోలీసులు బాధితురాలు మంచిర్యాలలో ఉన్నట్లు గుర్తించారు.ఇద్దరినీ అదుపులోకి తీసుకొనిజూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
జ్ఞానేశ్వర్కు గతంలోనే వివాహమైందని, ఒక కుమార్తె కూడా ఉందని విచారణలో తేలింది.నిందితుణ్ణి పోలీసులు జైల్లోకి తోసేసారు.