ఈ రోజుల్లో యువతకు ఏ విషయంలోనూ ఓపిక ఉండడం లేదు.ప్రతి చిన్న విషయానికి హత్యల వరకు వెళ్తున్నారు.
తొందరపాటు నిర్ణయాలతో నిండు జీవితాన్ని బలి తీసుకుంటున్నారు.ప్రతి చిన్న విషయానికి క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు.
ప్రేమించలేదని కొందరు చంపే వరకు వెళ్తుంటారు.మరికొందరు ప్రేమ ఫలించలేదని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు.
సరిగ్గా అలాంటి సంఘటనే ఇప్పుడు జరిగింది.ట్రాన్సజెండర్ ఒక యువకుడిని ప్రేమించింది.ఆ విషయాన్నీ ఆ యువకుడికి చెప్పింది.ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని చెప్పింది.
ఆ ప్రపోజల్ కు ఆ యువకుడు ఒప్పుకోలేదు.ప్రేమించిన యువకుడు తన ప్రేమను అంగీకరించలేదని ఆమె ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటనకు సంభందించి అందుతున్న వివరాలు ఇలా ఉన్నాయి.
కడప నగరంలో ఏఎస్ఆర్ నగర్ కు చెందిన శ్రీలేఖ అనే ట్రాన్స్ జెండర్ ఉంటుంది.
ఆమె ఒక షాపులో పనిచేస్తూ జీవనం సాగిస్తుంది.ఆమెను గతంలో ప్రసాద్ అనే పేరుతో పిలిచేవారు.
అయితే ట్రాన్స్ జెండర్ గా మారిన తర్వాత పేరు మార్చుకుని శ్రీలేఖ అని పెట్టుకుంది.అయితే కడపలోనే నివాసం ఉంటున్న ఒక యువకుడిని కొంతకాలంగా ప్రేమిస్తుంది.
చాలా రోజుల వరకు తన ప్రేమను ఆ యువకుడికి చెప్పలేదు.చివరకు ఒక రోజు దైర్యం చేసి చెప్పింది.అయితే ఆ యువకుడు శ్రీలేఖను తిరస్కరించాడు.నేను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుని జీవితాంతం నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను అని చెప్పిన శ్రీలేఖ ప్రేమ, పెళ్ళి ప్రపోజల్ ని ఆ యువకుడు తిరస్కరించాడు.
ఆ యువకుడు తన ప్రేమను తిరస్కరించాడని శ్రీలేఖ చాలా బాధపడింది.ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి తన ప్రేమను కాదన్నాడన్న బాధతో ఎంతో దుఃఖించింది.ప్రేమ వైఫల్యం చెందిదన్న బాధతో గురువారం రాత్రి వాళ్ళ ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.స్పృహ కోల్పోయిన ఆమెను స్థానికులు చూసి ఆసుపత్రికి తరలించారు.
శుక్రవారం రోజు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శ్రీలేఖ మరణించింది.
ప్రేమ ఫలించలేదన్న బాధతో శ్రీలేఖ ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.