బుల్లితెరపై ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతో క్రేజ్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇప్పటికీ తెలుగులో 5 సీజన్లను పూర్తిచేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే ఆరో సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది.
ఈ క్రమంలోనే ఈ మధ్యలో బిగ్ బాస్ కార్యక్రమాన్ని ఓటీటీలో ప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు.ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఈ కార్యక్రమానికి హాజరై ప్రస్తుతం కెరీర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ కార్యక్రమంలోకి కంటెస్టెంట్ గా ఎంతో పేరున్న సెలబ్రిటీలను ఆహ్వానించడమే కాకుండా మూడవ సీజన్ నుంచి ట్రాన్స్ జెండర్ లను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది.గతంలో తమన్నా, సింహాద్రి బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనగా తాజాగా పూర్తి అయిన ఐదవ సీజన్ లో ట్రాన్స్ జెండర్ గా ప్రియాంక సింగ్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు.
బిగ్ బాస్ హౌస్ లో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న ప్రియాంక సింగ్ ఏకంగా 13 వారాల పాటు హౌస్ లో కొనసాగారు.ఇక పోతే తాజాగా వచ్చే సీజన్లో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనున్న ట్రాన్స్ జెండర్ గురించి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వినపడుతున్నాయి.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమంలోకి ట్రాన్స్ జెండర్ గా హిజ్రా ఫౌండర్,స్పోక్ పర్సన్ చంద్రముఖి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు పెద్ద ఎత్తున వినపడుతున్నాయి.
అయితే త్వరలోనే ఓటీటీలో ప్రసారం కానున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఈమెకు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఫోన్ వెళ్లిందని అయితే ఈమె ఓటీటీలో ప్రసారమయ్యే కార్యక్రమంలో పాల్గొనడానికి సుముఖంగా లేనట్టు తెలుస్తోంది.కానీ బిగ్ బాస్ సీజన్ 6 లో తనకు అవకాశం వస్తే తప్పకుండా వెళ్తానని ఈ సందర్భంగా చంద్రముఖి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.ఒకవేళ బిగ్ బాస్ అవకాశం వస్తే తప్పకుండా ఈ కార్యక్రమానికి వెళతానని ఇప్పటికే చాలామంది అభిమానులు నన్ను బిగ్ బాస్ కి రమ్మని సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారనే విషయాన్ని కూడా ఈమె తెలిపారు.
ఒకవేళ నాకు ఈ అవకాశం వచ్చి నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళితే అందరి మాదిరిగా కాకుండా నా స్టైల్ లో నేను వెళ్తానని.మా కమ్యూనిటీకి మంచి పేరు తీసుకు వస్తానని తెలిపారు.
అయితే బిగ్ బాస్ అవకాశం వస్తే తప్పకుండా వెళతాను రాకపోయినా బాధపడను.బిగ్ బాస్ సీజన్ 3 కి నాకు ఈ అవకాశం వచ్చిందని, అప్పుడు కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా ఈ అవకాశాన్ని వదులుకున్నానని తెలిపారు.