శర్వానంద్ హీరోగా శ్రీకారం అనే సినిమా రూపొందిన విషయం తెల్సిందే.విడుదలకు సిద్దం అయిన ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
ఈ సినిమా లో మొదటి నుండి కూడా శర్వానంద్ రైతు పాత్ర లో కనిపించబోతున్నట్లుగా ప్రచారం చేశారు.దాంతో హీరో ఒక రైతు పాత్ర లో అంటూ శ్రీకారం సినిమా పై అంచనాలు పెంచేసుకున్నారు.
పెద్ద ఎత్తున శ్రీకారం సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి నిరాశ మిగిల్చేలా ట్రైలర్ ఉంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.గతంలో చాలా సినిమా ల్లో చూసిన మాదిరిగా హీరో ఒక పెద్ద కంపెనీలో సస్సెస్ ఫుల్ ఎంప్లాయి.
ఆయన తన ఉద్యోగం పట్ల విసుగు చెంది వ్యవసాయం చేసేందుకు ముందుకు వస్తాడు.ఇదే ట్రైలర్ లో చూపించారు.
ట్రైలర్ తో సినిమా కథ మొత్తం తేలిపోయింది. రైతు కథ అంటే ప్రేక్షకులు మరో విధంగా ఊహించుకున్నారు.కార్తి హీరోగా నటించిన చినబాబు తరహా కథతో ఈ సినిమా ఉంటుందని శర్వానంద్ మొదటి నుండి కూడా రైతు గా కనిపిస్తాడని ప్రేక్షకులు భావించారు.కాని తాజాగా వచ్చిన ట్రైలర్ ను చూస్తుంటే మొత్తం కథ గతంలో వచ్చిన పాత సినిమాల కథలను మిక్సీలో వేసి రుబ్బి ఒక కథ గా తయారు చేసినట్లుగా అనిపిస్తుంది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
శర్వానంద్ గత ఏడాది జాను సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పర్చాడు.శ్రీకారం సినిమాతో అతి త్వరలో రాబోతున్నాడు.
ప్రియాంక మోహన్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటించింది.మరి ఈ సినిమా తో అయినా శర్వా సక్సెస్ ను దక్కించుకుంటాడా అనేది చూడాలి.
తాజా వార్తలు