వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ సస్పెన్షన్

ప్రేమ పెళ్లి చూసుకుని తనను వేధింపులకు గురిచేసినట్టుగా భావన అనే ఓ యువతి గతంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రైనీ ఐపీఎస్ ను తాత్కాలికంగా సస్పెండ్ అయ్యారు.పూర్తి వివరాలు పరిశీలిస్తే కడప జిల్లాకు చెందిన మహేశ్వర్‌ రెడ్డి సివిల్స్‌లో 126వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌గా ఎంపికయ్యారు.

 Trainee Ips Maheshwar Reddy Suspended-TeluguStop.com

ప్రస్తుతం ముస్సోరీలో ప్రాథమిక శిక్షణ పూర్తి చేశారు.అయితే తనను ప్రేమ పెళ్లి చేసుకుని వేధించారని మహేశ్వర్‌రెడ్డిపై ఆయన భార్య భావన హైదరాబాద్‌ జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

విడాకులు ఇవ్వాలంటూ బెదిరించడమే కాకుండా అధిక కట్నం కోసం మరో పెళ్లికి సిద్ధమయ్యాడంటూ ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదు మేరకు జవహర్ నగర్ పోలీసులు గృహహింస, ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

కేసు దర్యాప్తు దశలో ఉన్నందున తాత్కాలికంగా మహేశ్వర్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.కేసు నుంచి విముక్తి పొందిన తర్వాత తిరిగి ట్రైనీ ఐపీఎస్‌గా ఆయన కొనసాగే అవకాశం ఉన్నట్టు కేంద్ర హోమ్ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube