రాధేశ్యామ్ ట్రైన్ సెట్ కోసం అంత ఖర్చు పెట్టారా..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం రాధేశ్యామ్.ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది.పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం నిర్మాతలు బాగానే ఖర్చుపెడుతున్నారు.

 Train Set In Prabhas's Radhe Shyam First Glimpse Costs Rs 1.6 Crore,radhe Shyam,-TeluguStop.com

ప్రేమికుల రోజు సందర్భంగా చిత్ర యూనిట్ గ్లింప్స్ ఆఫ్ రామ్ పేరుతో ఒక వీడియో విడుదల చేసారు.

ఈ వీడియో నిడివి చాలా తక్కువగా ఉన్నా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇందులో ప్రభాస్ చెప్పిన డైలాగులు అభిమానులకు బాగా నచ్చాయి.రోమియో ప్రేమ కోసం చచ్చాడు.కానీ నేను ఆ టైప్ కాదు.

అని యంగ్ రెబల్ స్టార్ చెప్పే డైలాగు ఆకట్టుకుంది.

Telugu Pooja Hegde, Prabhas, Radhe Shyam, Train Set-Movie

రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ కాస్ట్యూమ్ కోసమే 7 కోట్ల వరకు ఖర్చు పెట్టి నట్లు వార్తలు వచ్చాయి.అయితే ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.ప్రేమికుల రోజు విడుదలైన రాధేశ్యామ్ గ్లింప్స్ వీడియోలో కనిపించిన ట్రైన్ చూడడానికి చాలా అందంగా కనిపించింది కదా.ఆ ట్రైన్ సెట్ కోసం ఏకంగా ఒక కోటి అరవై లక్షలు ఖర్చు చేశారట.

ఈ సినిమాలో కనిపించే ట్రైన్ సీన్ ఇటలీ లో తీయాలని అనుకున్నారట.కానీ కరోనా కారణంగా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.అందువల్ల ఇక్కడే రైల్వే స్టేషన్ సెట్టింగ్ వేసి ఆ సీన్లు చిత్రీకరించారు.అన్నపూర్ణ స్టూడియోస్ లో దాదాపు 250 మంది 30 రోజులపాటు ఈ సెట్ వేయడానికి రాత్రిపగలు ఎంతో కష్టపడ్డారు.

కాగా ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది.జులై 30 న రాధేశ్యామ్ సినిమా విడుదల కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube