యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం రాధేశ్యామ్.ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది.పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం నిర్మాతలు బాగానే ఖర్చుపెడుతున్నారు.
ప్రేమికుల రోజు సందర్భంగా చిత్ర యూనిట్ గ్లింప్స్ ఆఫ్ రామ్ పేరుతో ఒక వీడియో విడుదల చేసారు.
ఈ వీడియో నిడివి చాలా తక్కువగా ఉన్నా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇందులో ప్రభాస్ చెప్పిన డైలాగులు అభిమానులకు బాగా నచ్చాయి.రోమియో ప్రేమ కోసం చచ్చాడు.కానీ నేను ఆ టైప్ కాదు.
అని యంగ్ రెబల్ స్టార్ చెప్పే డైలాగు ఆకట్టుకుంది.
రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ కాస్ట్యూమ్ కోసమే 7 కోట్ల వరకు ఖర్చు పెట్టి నట్లు వార్తలు వచ్చాయి.అయితే ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.ప్రేమికుల రోజు విడుదలైన రాధేశ్యామ్ గ్లింప్స్ వీడియోలో కనిపించిన ట్రైన్ చూడడానికి చాలా అందంగా కనిపించింది కదా.ఆ ట్రైన్ సెట్ కోసం ఏకంగా ఒక కోటి అరవై లక్షలు ఖర్చు చేశారట.
ఈ సినిమాలో కనిపించే ట్రైన్ సీన్ ఇటలీ లో తీయాలని అనుకున్నారట.కానీ కరోనా కారణంగా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.అందువల్ల ఇక్కడే రైల్వే స్టేషన్ సెట్టింగ్ వేసి ఆ సీన్లు చిత్రీకరించారు.అన్నపూర్ణ స్టూడియోస్ లో దాదాపు 250 మంది 30 రోజులపాటు ఈ సెట్ వేయడానికి రాత్రిపగలు ఎంతో కష్టపడ్డారు.
కాగా ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది.జులై 30 న రాధేశ్యామ్ సినిమా విడుదల కానుంది.