సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘ఓబేబీ’ చిత్రం గురించి గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.నందిని రెడ్డి దర్శకత్వంలో సురేష్ బాబు మరి కొందరు నిర్మాతలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాడు.
భారీ అంచనాలున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇప్పటికే విడుదలైన టీజర్తో సినిమా ఎలా ఉండబోతుందో అనే విషయాన్ని క్లారిటీ ఇచ్చేశారు.
ఇప్పుడు సినిమా పై అంచనాలు పెంచే విధంగా ట్రైలర్ ఉండటంతో సినిమాకు భారీ ఓపెనింగ్స్ ఖాయం అంటూ తేలిపోయింది.
‘ఓబేబీ’ చిత్రంను మొదటి నుండి కూడా ఎంటర్టైన్మెంట్ మూవీ అంటూ ప్రచారం చేస్తున్నారు.అయితే ట్రైలర్లో సినిమాలో ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా ఎమోషనల్ సీన్స్ ఉంటాయని తేలిపోయింది.ఎమోషనల్ సీన్స్తో సినిమా స్థాయి అమాంతం పెరుగుతుందని అంటున్నారు.
ఒక ముసలమ్మ పడుచు అమ్మాయి అయితే ఎదురయ్యే సిల్లీ సమస్యలు మరియు పెద్ద సమస్యలను దర్శకురాలు చూపించడం జరిగింది.భారీ ఎత్తున కామెడీతో పాటు కన్నీరు పెట్టించే సీన్స్ కూడా ఉంటాయట.
సమంత ఈ చిత్రంలో ఓబేబీ పాత్రలో నటించింది.కొరియన్ మూవీ అయిన మిస్ గ్రానీ చిత్రానికి ఇది రీమేక్ అయినా కూడా పూర్తిగా మార్పులు చేర్పులు చేసినట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన విషయాల్లో తెగ చర్చ జరుగుతోంది.ముసలమ్మ పడుచు అమ్మాయి అయితే ఆమె పట్ల చుట్టు పక్కల వారు చూపించే విభిన్నమైన వ్యవహార శైలిని ఈ చిత్రంలో చూపించడం జరుగుతుంది.
సమంత నవ్వించడంతో పాటు ఏడిపించడం కూడా చేస్తుందని ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది.సమంతకు ఈ చిత్రం మరో విజయాన్ని తెచ్చి పెట్టడం ఖాయం అని ముందే తేలిపోయిందంటూ ఆమె అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.