శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో విషాదం నెలకొంది.కేదారిపురం గ్రామ సమీపంలోని వరహాలగెడ్డ వద్ద వరద నీటిలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.గల్లంతైన వ్యక్తులు పాడి శంకర్, కూర్మారావులుగా గుర్తించారు.
ఈ క్రమంలో బ్రిడ్జికి సమీపంలో శంకర్ మృతదేహాం లభ్యమైంది.మరోకరి మృతదేహం కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
దీంతో గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి.