ఇటీవల తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నం నుంచి వెళ్తున్న కారు అదుపుతప్పి గోకవరం వద్ద విద్యుత్ స్తంభాన్ని వేగంగా వచ్చి ఢీకొనడంతో స్తంభంపై కారు పడి మంటలు చెలరేగడంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు.
మృతుల వివరాలు చూస్తే విశాఖ ఫిషింగ్ హార్బర్ బుక్క వీధికి చెందిన హనుమంతరావు, దేవీపట్నం మండలంకి చెందిన సతీష్ గా పోలీసులు గుర్తించారు.
ఇదే క్రమంలో కారులో ఉన్న ముగ్గురు రమాదేవి, భాను, ఆదిత్య కుమార్ కొద్దిపాటి గాయాలతో బయటపడటంతో, వెంటనే అగ్నిమాపక సిబ్బంది రావడంతో గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.ఈ సంఘటన తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతులను చూసి కన్నీరుమున్నీరవుతున్నారు.