విషాదం కృష్ణ నదిలో ఈతకు వెళ్లి నలుగురు మృతి..!!

సోమవారం విషాదం చోటుచేసుకుంది.గద్వాల్ జిల్లా( Jogulamba Gadwal ) జోగులాంబలో విషాద సంఘటన చోటుచేసుకుంది.

 Tragedy Four People Died While Swimming In Krishna River Kurnool ,swimming, Kris-TeluguStop.com

వేసవి సెలవులు కావడంతో బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లి సరదాగా ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు కృష్ణా నది( Krishna River )లో మునిగి ప్రాణాలు కోల్పోయారు.వీరిలో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు.

మానవపాడు మండలం పల్లెపాడు శివారులోని కృష్ణా నదిలో ఈ దుర్ఘటన జరిగింది.ఈ చిన్నారులు మృతి చెందటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

మృతుల వివరాలు చూస్తే ఆఫ్రిన్ (17), సమీర్ (8), నౌషిన్ (7), రిహాన్(15) గా గుర్తించడం జరిగింది.తెలంగాణకు చెందిన వీళ్లు కొన్నాళ్ల క్రితమే కర్నూలుకి వెళ్లి అక్కడ స్థిరపడ్డారు.

అయితే వివాహ శుభకార్యం నిమిత్తం మానవపాడు మండలం బోరెల్లి గ్రామానికి రెండు రోజుల క్రితం కుటుంబ సమేతంగా బంధువులతో కలసి రావటం జరిగింది.ఈ క్రమంలో సోమవారం సమీప గ్రామంలోని పల్లెపాడు శివారులో ఉన్న కృష్ణానదిలో ఈత కొట్టడానికి దాదాపు 11 మంది ఆటోలో వెళ్లారు.

అక్కడికి వెళ్లిన తర్వాత స్నానం చేయాలని భావించి.దిగగా మృతులు నలుగురు లోతైన ప్రాంతంలో దిగడంతో.బయటకు రాలేక ప్రాణాలు కోల్పోయారు.ఒకే కుటుంబానికి చెందిన వారు కావటంతో… కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube