కోలీవుడ్ స్టార్ హీరోల్లో విజయ్ దళపతి ఒకరు.ప్రెజెంట్ విజయ్ కోలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నాడు.
ఈయన ఫ్యాన్స్ ఈయన నుండి కొత్త సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.మరి ఈసారి విజయ్ పొంగల్ రేస్ లో రాబోతున్న విషయం తెలిసిందే.
తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు సినిమా చేస్తున్నాడు.విజయ్ దళపతి నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ క్రేజీ సినిమాను దిల్ రాజు భారీ స్థాయిలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నాడు.
ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అందరిని అలరిస్తుంది.
ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కానుంది.
తెలుగులో చిరంజీవి, బాలయ్య వంటి స్టార్ హీరోలతో పోటీ పడబోతున్న ఈ సినిమా సంక్రాంతికి ఏ మేర హిట్ అందుకుంటుందో చూడాలి.
ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు మరో వారం మాత్రమే ఉండడంతో ఆ హడావిడిలో యూనిట్ సభ్యులు మొత్తం ఉన్నారు.
అయితే సడెన్ గా ఈ టీమ్ కు షాకింగ్ న్యూస్ తెలిసింది.ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన సునీల్ బాబు మరణించాడు అని తెలియడంతో వారసుడు టీమ్ లో విషాదం నెలకొంది.
సునీల్ బాబు ఈ సినిమాలోని అత్యంత కీలకం అయిన ఇంటి సెట్ తో పాటు పాటల సెట్స్ కు కూడా ఈయన వర్క్ చేశారట.మరి ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా సునీల్ బాబు కారణంగా గత రాత్రి మరణించడంతో టీమ్ సభ్యులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈయన సీతారామం సినిమాకు కూడా ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసారు.