తెలుగు సినీ యువ నటుడు కార్తికేయ నటించిన సినిమా ఈ రోజు థియేటర్ లో విడుదలయ్యింది.కానీ కార్తికేయ కు ఓ వైపు సినిమా విడుదల అవ్వగా.
మరోవైపు ట్రాఫిక్ పోలీస్ వార్నింగ్ ఇచ్చాడు.అదేంటి కార్తికేయ కు ట్రాఫిక్ పోలీస్ నుండి వార్నింగ్ రావడమేంటి అనుకుంటున్నారా.
అవును మీరు విన్నది నిజమే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ హీరో కార్తికేయ ను ఇన్ డైరెక్ట్ గా హెల్మెట్ పెట్టుకోమని వార్నింగ్ ఇచ్చాడు.అంతేకాకుండా చావు కబురు చల్లగా సినిమాలో ఓ సన్నివేశంలో బైక్ డ్రైవింగ్ చేస్తూ ఉన్న కార్తికేయ, లావణ్య త్రిపాఠి ఫోటో ను షేర్ చేస్తూ.“హెల్మెట్ పెట్టుకుని, సరిగ్గా నడిపితే ఎలాంటి కబుర్లు వినాల్సిన పని లేదు బస్తీ బాలరాజు గారు” అంటూ జత చేశారు.అంతే కాకుండా ఈ ఫోటోలో ట్రాఫిక్ పోలీస్ లోగో ఉండగా ప్రస్తుతం వైరల్ గా మారింది.
హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి నటించిన సినిమా ‘చావు కబురు చల్లగా’.ఈ సినిమా అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై నిర్మాత బన్నీవాసు నిర్మించారు.
కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వహించారు.ఇక ఈ సినిమాలో కార్తికేయ పాత్ర కొత్తగా ఉండగా అందులో ఆయన శవాల బండికి డ్రైవర్ గా, బస్తీ బాలరాజు పాత్రలో నటించాడు.
ఇందులో లావణ్య త్రిపాఠి వితంతుగా మల్లిక పాత్రలో నటించింది.ఇక ఈ సినిమా ఈ రోజు ( మార్చి 19న) ప్రేక్షకుల ముందు విడుదల కాగా.
ప్రస్తుతానికి ఈ సినిమా గురించి యావరేజ్ టాక్ అని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో బస్తీ బాలరాజు శవాలను/em> మోసుకెళ్లే వాహనం డ్రైవర్ గా పని చేస్తాడు.
ఎలాంటి బాధ్యతలను పట్టించుకోకుండా బాలరాజు కాలాన్ని గడుపుతున్న సమయంలో.ఓ చావులో భర్తను కోల్పోయిన మల్లికను చూసి అక్కడే ప్రేమలో పడతాడు.
కానీ మల్లిక బాల రాజు ప్రపోజల్ ను నిరాకరిస్తుంది.కానీ బాలరాజు మాత్రం వినకుండా ఆమె వెంట పడతాడు.
ఇదిలా ఉంటే బాలరాజు తల్లి భర్త ఉండగానే వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం బాలరాజుకు తెలుస్తుంది.
ఇక మల్లికను పెళ్లికి ఒప్పించాడా? మల్లిక వాళ్ళ మామతో, ఆయన కుటుంబంతో బాలరాజు వ్యవహరించిన తీరు ఎలా ఉంటుందనే, తన తల్లి వివాహేతర సంబంధం గురించి బాలరాజు రియాక్షన్ ఏమిటి అనేది, ఇక ఏ పరిస్థితుల్లో తన తల్లి కి మరో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడని, చివరకు మల్లిక ను పెళ్లి చేసుకొంటాడా లేదా అని ఈ సినిమాలో చూపించిన కథ.