పాములను చూస్తే ఎవరు మాత్రం భయపడరు.ఇంకా అలానే ఓ రైతు కూడా పామును చూశాడు.
కంగారు పడి మృతి చెందాడు.ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి.రోడ్డుపై అడ్డంగా ఉన్న పామును చూసి కంగారులో ట్రాక్టర్ ను పక్కకు తప్పించబోయాడు.అయితే అమాంతం ట్రాక్టర్ తిరగబడడంతో తీవ్రగాయాలు అయ్యాయి.
దీంతో స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.అయితే చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
ఇంకా ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.దర్శి నియోజకవర్గ పరిధిలోని తాళ్లూరు మండలం లక్కవరం గ్రామానికి చెందిన 31 ఏళ్ళ రమేష్ రెడ్డి రాత్రి సమయంలో ట్రాక్టర్లో మట్టి తరలిస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే అతను పశువుల కొట్టం నుండి ట్రాక్టర్లో వెళ్తుండగా రోడ్డుకి అడ్డంగా పెద్ద పాము కనిపించడంతో ఈ దారుణ ఘటన జరిగింది.సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా పాములకు సంబంధించిన ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి.