ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటు చేసుకున్న రైలు ప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది.దీంతో అధికారులు ట్రాక్ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు.
ప్రమాద ఘటన నేపథ్యంలో రంగంలోకి దిగిన ఆర్మీ, వాయుసేన బృందాలు శరవేగంగా రెస్క్యూ చేపట్టాయి.శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడిన బృందాలు బాధితులను సమీప ఆస్పత్రులకు తరలించారు.
అదేవిధంగా సురక్షితంగా బయటపడిన వారిని స్వస్థలాలకు తరలిస్తున్నారు.ఇందులో భాగంగా సుమారు 250 బాధితులతో భద్రక్ స్టేషన్ నుంచి ఓ ట్రైన్ బయలు దేరింది.
ఈ రైలు రేపు ఉదయం 9 గంటలకు చెన్నైకు చేరుకోనుందని అధికారులు వెల్లడించారు.