గత మూడేళ్ళుగా ఆదిమానవుల అవశేషాల కోసం పరిశోధిస్తూ ముందుకు సాగుతున్న ప్రొఫెసర్ రత్నాకర్ రెడ్డి కి అవశేషాలుదండిగా లభించాయి.ఆయన ఉల్లాసంగా వాటిని సేకరించి మీడియా ముందు ప్రదర్శించారు .
రఘునాధపల్లె సమీపంలో గోవర్ధనగిరి గోపాలస్వామి కొండల్లో ఈ ఆదిమానవుల నివాస జాడలు నాటి గుర్తులు లభించినట్లు రత్నాకర్ రెడ్డి తెలిపారు.వాస్తవానికి ఈ తరహా పరిశోధకులకు ఇతర దేశాల్లో కంటే ఈ దేశం లో వెతుకులాటకు సరిపడా పరికరాలు, తగు వనరులు కల్పించడంలో పాలకులు బాగా వెనకపడ్డారనే చెప్పాలి.
విదేశాల్లో జరుగుతున్న పరిశోధనకు అన్ని విధాల అక్కడ [ప్రభుత్వం సహస్ర బాహువులతో సహకారం అందిస్తుంది.అందుకే చరిత్ర పరిశోధకులకు ఇక్కడ పరిశోధనలో ముందుకు పోవడం చాల కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి అయినా కిందామీదా పడి పరిశోధకులు తమ పని చక్కబెట్టడంలో ముందుకు సాగుతూనే ఉంటారు .